కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్: ఏపీ హైకోర్టులో హరిరామజోగయ్య పిటిషన్

Published : Feb 06, 2023, 04:05 PM ISTUpdated : Feb 06, 2023, 04:11 PM IST
కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  5 శాతం రిజర్వేషన్:  ఏపీ హైకోర్టులో  హరిరామజోగయ్య పిటిషన్

సారాంశం

కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ  ఏపీ హైకోర్టులో  మాజీ మంత్రి హరిరామజోగయ్య  పిటిషన్ దాఖలు  చేశారు.

అమరావతి: కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని  కోరుతూ  ఏపీ హైకోర్టులో   మాజీ మంత్రి హరిరామజోగయ్య  పిటిషన్ దాఖలు  చేశారు.ఇదే  డిమాండ్ తో  ఇటీవల  హరిరామజోగయ్య  దీక్ష చేసిన విషయం తెలిసిందే . 

కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  5 శతం రిజర్వేషన్ కల్పించాలని   గత ఏడాది డిసెంబర్ మాసంలో  హరిరామజోగయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ విషయమై  సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకపోతే  ఈ ఏడాది జనవరి  1 నుండి  నిరహరదీక్ష చేస్తానని  ప్రకటించారు. అయితే  ఈ ఏడాది జనవరి  1వ తేదీన  హరిరామజోగయ్య  దీక్షకు దిగాడు. దీక్షను  ప్రారంభించిన  వెంటనే  పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  కూడా దీక్ష కొనసాగించారు.ఈ విషయం తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  హరిరామజోగయ్యకు  ఫోన్  చేశాడు. దీక్షను విరమించాలని కోరారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో  ఉంచుకొని దీక్ష విరమించాలని  కోరారు.దీంతో  హరిరామజోగయ్య  దీక్షను విరమించాడు. 

ఇదే డిమాండ్ తో  ఏపీ హైకోర్టులో  ఆయన  పిటిషన్ దాఖలు  చేశారు.   రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన  ఆదేశాల  మేరకు  ఈడబ్ల్యుఎస్ కింద  కాపులకు  5 శాతం రిజర్వేషన్లు  కల్పించాలని హరిరామజోగయ్య  డిమాండ్  చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే