ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు విశాఖపట్నంలోని BC వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి, చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. "చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు" అని పేర్కొంటూ విద్యార్థినులకు ప్రోత్సాహం ఇచ్చారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలపై కూడా సూచనలు చేశారు.