సూళ్లూరుపేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఐదుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 1, 2023, 1:02 PM IST
Highlights


తిరుపతి జిల్లాలోని  సూళ్లూరుపేటలోని ఓ ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ ఘటనలో  ఐదుగురు గాయపడ్డారు.  


తిరుపతి: జిల్లాలోని  సుళ్లూరుపేటలోని  ఓ ఇంట్లో  బుధవారం నాడు గ్యాస్ సిలిండర్  పేలింది.  ఈ ఘటనలో   ఐదుగురు గాయపడ్డారు.  గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా  ఉన్నారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు. 

దేశంలోని  పలు  రాష్ట్రాల్లో  ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ల  పేలుడు ఘటనలు  చోటు  చేసుకున్నాయి.  గ్యాస్ వినియోగదారుల అజాగ్రత్తగా  వ్యవహరించడంతో  పాటు  ఇతరత్రా కారణాలతో  గ్యాస్ సిలిండర్ల  పేలుళ్లు జరిగాయి. 

రాజస్థాన్ లోని జోథ్ పూర్‌లో భుంగ్రా గ్రామంలో  పెళ్లి వేడుకలో  గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ ఘటనలో  నలుగురు మృతి చెందారు.  మరో  46 మందికి గాయాలయ్యాయి.  గాయపడిన వారిన ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటన  2022 డిసెంబర్  9వ  తేదీన  జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని తిప్పకట్ట వద్ద గ్యాస్ సిలిండర్  పేలింది.  ఈ ఘటన 2022 డిసెంబర్  4వ తేదీన జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

2022 అక్టోబర్  26న సికింద్రాబాద్  పరిధిలోని  చిలకలగూడలో గ్యాస్ సిలిండర్  పేలింది.  ఈ ఘటనలో  ఒకరు మృతి చెందారు. మరో  ఐదుగురు గాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  దద్దవాడ వద్ద  2022  సెప్టెంబర్ 2న  లారీలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న సమయంలో  లారీ ప్రమాదానికి గురైంది.  ఈ సమయంలో  లారీలోని  సిలిండర్లు  పేలిపోయాయి.  దీంతో ఈ  రహదారిపై  రాకపోకలను  పోలీసులు  నిలిపివేశారు. 

also read:బాపట్ల జిల్లా తిప్పకట్టలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో  నలుగురు మృతి చెందారు. ఈ ఘటన  గత ఏడాది ఆగష్టు  7వ తేదీన  చోటు చేసుకుంది .2021  హైద్రాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్   పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలుడుతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

click me!