సముద్రంలో బోల్తా పడిన పడవ: ముగ్గురు జాలర్ల మృతి

By telugu teamFirst Published Aug 14, 2021, 10:30 AM IST
Highlights

చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ విషాదకరమైన సంఘటన శ్రీకాకుళం జిల్లా బందరువానిపేట సముద్ర తీరంలో చోటు చేసుకుంది.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకరమైన సంఘటన జరిగింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. వారు ముగ్గురు కూడా మరణించినట్లు భావిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం బందరువానిపేట తీరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అతన్ని గణేష్ గా గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

మృతి చెందిన జాలర్లు బందరవానిపేటకు చెందినవారు. మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!