శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. దగ్ధమవుతున్న కాకులకోన..

Published : Mar 19, 2021, 01:08 PM IST
శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. దగ్ధమవుతున్న కాకులకోన..

సారాంశం

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరుగుతుండడంతో అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతోంది.

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరుగుతుండడంతో అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతోంది.

ఈ ప్రాంతంలో మూడు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానం అటవీ విభాగం సిబ్బంది బ్లోయర్లు, చెట్లు కొమ్మల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి వీస్తుండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి, శేషాచలం అటవీ ప్రాంతం లోని వాచ్ టవర్ల ద్వారా అటవీ విభాగం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు.

సిబ్బంది మంటలు వ్యాపించిన ప్రదేశానికి చేరుకుని తీవ్రత ఎక్కువగా లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలకు 6 రోజులు వర్ష గండం.. ఐఎండీ అలర్ట్
Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు