తాడేపల్లి గూడెంలో ఘర్షణ.. ఒకరు మృతి

Published : Apr 12, 2019, 10:27 AM IST
తాడేపల్లి గూడెంలో ఘర్షణ.. ఒకరు మృతి

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మసీదు సెంటర్లో అర్థరాత్రి కొందరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. మొదట చిన్న వివాదంగా ప్రారంభమై.. తర్వాత అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మసీదు సెంటర్లో అర్థరాత్రి కొందరు యువకుల మధ్య వివాదం తలెత్తింది. మొదట చిన్న వివాదంగా ప్రారంభమై.. తర్వాత అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో కొందరు యువకులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు.

ఈ క్రమంలో జానీ అనే యువకుడు పై  మరో యువకుడు సంపత్ చాకుతో దాడికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ పిల్లి వెంకన్న(45) తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

తీవ్రగాయాల పాలైన జానీ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంపత్ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే