వైఎస్ జగన్ పేరిట ఫేక్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

Published : Apr 25, 2019, 07:23 AM IST
వైఎస్ జగన్ పేరిట ఫేక్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరిట ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరిట ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై విమర్శలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని జగన్ పేరిట ఎవరో ట్వీట్ చేశారు. కాగా.. ట్వీట్ పట్టుకొని జగన్ ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

దీంతో.. ఈ ఘటనపై వైసీపీ నేతలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu