వివాహేతర సంబంధం : భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య...

Published : Sep 13, 2023, 09:38 AM IST
వివాహేతర సంబంధం : భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య...

సారాంశం

నంద్యాలలో అక్రమ సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది ఓ భార్య. 

కర్నూలు : ఏపీలోని కర్నూలు జిల్లా, మహానంది మండలంలో ఉపాధ్యాయుడు దారుణ హత్య కేసును నంద్యాల పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి.. మంగళవారం మీడియాతో నంద్యాల ఎస్పీ కె.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన బాధితురాలు సింధే నర్సోజికి జయశ్రీతో వివాహమయింది.

ఆ తరువాత కొంతకాలానికి నర్సోజీ భార్య అదే గ్రామానికి చెందిన రవీంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధం ఆరేళ్లుగా కొనసాగుతోంది. ఈ విషయం బయటపడడంతో తరచూ గొడవలు జరగడం, గ్రామ పెద్దలు కూడా జోక్యం చేసుకోవడం కూడా జరిగింది. 

చంద్రబాబు కోసం.. రిషికేష్ లో కేశినేని దంపతుల ప్రత్యేక పూజలు

సెప్టెంబర్ 2న నర్సోజీ, రవీంద్ర మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ జరుగుతున్న సమయంలో జయశ్రీ తన భర్తను అంతమొందించాలని రవీంద్రకు చెప్పింది. నర్సోజీని హత్య చేస్తే ఎలాంటి పరిణామాలు ఉండవని ఆమె చెప్పినట్లు సమాచారం.

సెప్టెంబర్ 4న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నర్సోజీ తన మోటార్‌సైకిల్‌పై పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతన్ని రవీంద్ర, అతని ఐదుగురు స్నేహితులు కలిసి దారిలో అడ్డగించారు. ఆ తరువాత అందరూ కలిసి గొడ్డలితో నరికి చంపారు.

నర్సోజీ తల్లి సింధే రాంబాయి ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని చాబోలు రోడ్డులోని గ్రామంలోని ఇటుక బట్టీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో మృతుడి భార్య సింధే జయశ్రీతో పాటు సిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన రవీంద్ర, గుండపోగుల రాజేష్, మహానంది మండలం బస్సాపురం గ్రామానికి చెందిన కాలె వెంకట రమణ, నక్క చిన్న నరసింహులు, నల్లబోతుల వెంకటేశ్వర్లు, నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన జజ్జం నాగేంద్ర ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu