వైసీపీకి పెరుగుతున్న బలం.. పార్టీలోకి మరో ముఖ్య నేత

First Published May 18, 2018, 3:05 PM IST
Highlights

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

వైసీపీకి రోజు రోజుకీ బలం పెరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు.  తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే ఈ పార్టీలో చేరారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌​ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు  వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.

click me!