దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు

Published : Aug 13, 2018, 04:26 PM ISTUpdated : Sep 09, 2018, 12:22 PM IST
దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు

సారాంశం

విజయవాడ: సీనియర్  అసిస్టెంట్ కృపావరం తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగి జ్యోతి దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా కృపావరం లైంగికంగా వేధిస్తున్నాడని ఈ విషయాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిపారు.  

విజయవాడ:
సీనియర్  అసిస్టెంట్ కృపావరం తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగి జ్యోతి దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా కృపావరం లైంగికంగా వేధిస్తున్నాడని ఈ విషయాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిపారు.

అయితే మంత్రి కేఈ పట్టించుకోకపోవడంతో కృపావరం ఆగడాలు ఎక్కువ అయ్యాయని ఆమె వాపోయారు. దీంతో జ్యోతి దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ దృష్టికి తీసుకెళ్లారు. కృపావరంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కృపావరం ఏన్జీవో నేత కావడంతో ఉన్నతాధికారులు సైతం  పట్టించుకోవడం లేదన్నారు. పట్టించుకోకపోగా రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి