కరెంట్ షాక్ తో ఏనుగు మృత్యువాత.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Published : Aug 03, 2023, 07:22 AM IST
కరెంట్ షాక్ తో ఏనుగు మృత్యువాత.. అన్నమయ్య జిల్లాలో ఘటన

సారాంశం

కరెంట్ షాక్ తో ఓ గజరాజు మృత్యువాత పడింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. మామిడి తోటకు రక్షణ కల్పించేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వేకోడూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఓ ఏనుగు మరణించింది. ఆ గ్రామంలోని ఓ మామిడి తోటలో ఆ గజరాజు కరెంట్ షాక్ తో మృత్యువాత పడింది. ఈ విషాయాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. 

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామంలో ఓ మామిడి తోట ఉంది. అయితే పంటను కోతులు వచ్చి పాడు చేస్తుంటాయి. తోటను చిందర వందర చేస్తుంటాయి. దీంతో వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు ఆ తోట యజమాని పొలం చుట్టూ కరెంట్ వైర్ పెట్టాడు. దానికి విద్యుత్ సరఫరా చేశాడు. 

దారుణం.. బాలికపై పలుమార్లు మేనబావ, అతడి స్నేహితులు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరు..

అయితే బుధవారం తెల్లవారుజామున శేషాచలం అడవుల నుంచి ఓ ఏనుగు ఆ పొలం వైపు వచ్చింది. ఆ మామిడి తోటను దాటే క్రమంలో ఆ విద్యుత్ వైర్లను తాకింది. దీంతో ఒక్క సారిగా దానికి కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆ వన్యప్రాణి అక్కడే కూలిపోయింది. అనంతరం తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు వదిలింది. శేషాచలం అడవుల నుంచి వచ్చి కరెంట్ షాక్ కు గురై ఏనుగు చనిపోయిందని అధికారులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

ఒక టీచర్ వల్లనే నేను ఈస్థాయికి వచ్చాను.. | Nara Lokesh Honors Best SSC & Inter Students in AP
ఒక్కరైనా రాజకీయాల్లోకి రావాలి | Nara Lokesh Felicitates AP SSC & Inter Shining Stars| Asianet Telugu