వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

Published : Jan 30, 2019, 04:58 PM IST
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. జిల్లాలోని వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ(65) అనే వృద్ధురాలు రాత్రి  ఇంటి గడపలో నిద్రించింది.

కాగా.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కలు ఆమె దాడికి పాల్పడ్డాయి. రాముడమ్మను ఈడ్చుకెళ్లాయి. అనంతరం విచక్షణా రహితంగా దాడి చేసి పీక్కొని తిన్నాయి. దీంతో తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

PREV
click me!

Recommended Stories

ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu