ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం: పరుగు తీసిన జనం (వీడియో)

Published : Feb 27, 2021, 09:29 AM ISTUpdated : Feb 27, 2021, 09:50 AM IST
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం: పరుగు తీసిన జనం (వీడియో)

సారాంశం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టర రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడా కొట్టుకున్న శబ్దాలు వినిపించాయి. భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

శనివారం ఉదయం 5.30, 6 గంటల మధ్య భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తూళ్లూరు, నెక్కల్లు, అనంతారం, కర్లపూడి ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాడికొండ మండలం బడెపురంలో పెద్ద శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకుంది. "

తూళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. తలుపులు దడదడా కొట్టుకోవడంతో ఎవరైనా తలుపులు తడుతున్నారేమోనని బయటకు వచ్చిన ప్రజలు భూప్రంకపనలతో తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో తుపాను..? ఈ ప్రాంతాల్లో కుండపోత వర్ష బీభత్సమేనా..?
Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?