ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం: పరుగు తీసిన జనం (వీడియో)

Published : Feb 27, 2021, 09:29 AM ISTUpdated : Feb 27, 2021, 09:50 AM IST
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం: పరుగు తీసిన జనం (వీడియో)

సారాంశం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టర రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడా కొట్టుకున్న శబ్దాలు వినిపించాయి. భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

శనివారం ఉదయం 5.30, 6 గంటల మధ్య భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తూళ్లూరు, నెక్కల్లు, అనంతారం, కర్లపూడి ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాడికొండ మండలం బడెపురంలో పెద్ద శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకుంది. "

తూళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. తలుపులు దడదడా కొట్టుకోవడంతో ఎవరైనా తలుపులు తడుతున్నారేమోనని బయటకు వచ్చిన ప్రజలు భూప్రంకపనలతో తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.

PREV
click me!

Recommended Stories

మీ స్వస్థలంలోనే ఆఫీస్ సెటప్.. ఖర్చులు ప్రభుత్వానివే, లక్షలకు లక్షల బెనిఫిట్స్ పొందండిలా..
RK Roja: జగనన్న మళ్లీ వస్తేనే మంచిరోజులు.. బాబుకి ఆ ధైర్యం లేదు | Asianet News Telugu