తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు జారారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరు జారారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మీరు దళితులని.. వెనుకబడిన వారని... రాజకీయాలు తమకుంటాయని... మీకెందుకంటూ అసభ్యపదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు మండిపడుతున్నాయి.