ఆనందయ్య మందు: 500 మంది నుండి డేటా సేకరించనున్న ఆయుర్వేద సంస్థ

Published : May 24, 2021, 04:38 PM IST
ఆనందయ్య మందు: 500 మంది నుండి డేటా సేకరించనున్న ఆయుర్వేద సంస్థ

సారాంశం

ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న వారి నుండి జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సమాచారాన్ని సేకరించనుంది. తొలి విడతలో ఈ మందును తీసుకొన్న 500 మంది వివరాలను అధికారులు సేకరించారు.


నెల్లూరు: ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకొన్న వారి నుండి జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సమాచారాన్ని సేకరించనుంది. తొలి విడతలో ఈ మందును తీసుకొన్న 500 మంది వివరాలను అధికారులు సేకరించారు.కరోనాతో ఇబ్బందిపడుతున్న 500 మంది ఆనందయ్య  మందు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. అంతకుముందు ఏ రకంగా ఉన్నారనే విషయమై సీపీఆర్‌ఏఎస్ బృందం పరిశీలించనుంది. ఆన్‌లైన్ ప్రొఫార్మాలో ఈ వివరాలను సేకరించనున్నారు. వీరి మెడికల్ రిపోర్టులపై కూడ ఆరా తీయనున్నారు. 

also read:ఆనందయ్య మందు:సీఎంఓ అధికారులతో ఆయుష్ కమిషనర్ భేటీ

ఈ విషయమై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుపతి ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రతినిధులు  ఈ వివరాలను సేకరించనున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆదేశించింది. ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ప్రకటించారు. ఇవాళ ఆయన సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఈ మందు గురించి జాతీయ పరిశోధన సంస్థ పరిశీలిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం