ఏపీలో కోర్టు ధిక్కార కేసు.. ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్..

Published : Jul 24, 2021, 04:44 PM IST
ఏపీలో కోర్టు ధిక్కార కేసు.. ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్..

సారాంశం

ఈ మేరకు సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. 

అమరావతి : ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ మేరకు సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. 

ఆదేశాలు అమలుచేసినప్పటికీ గత వాయిదాకు సత్యనారాయణ ఆలస్యంగా హాజరయ్యారు. కేసు విచారణలో సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.

రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు తెలిపింది. దీంతో శిక్షను నిలిపి వేయాలని సత్యనారాయణ, ఆయన తరపు న్యాయవాది  కోరారు. కాగా, సత్యనారాయణ విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తా మని హైకోర్టు తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్