మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం..

Published : Apr 17, 2023, 08:43 AM IST
మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం..

సారాంశం

ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

పల్నాడు జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఓ దారుణ చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై  ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కానిస్టేబుల్ దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబు అనే కానిస్టేబుల్ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పిడుగురాళ్ల పోలీసులను ఆశ్రయించారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పిడుగురాళ్ల పోలీసులు కానిస్టేబుల్ నాగబాబుపై కేసు నమోదు చేశారు. నాగబాబును దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, భర్త మైనర్ బాలికపై అత్యాచారం చేయడం.. అతడిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిన నాగబాబు భార్య..  మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా..  ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరుగుతుంది.

హరీష్ రావు ఏమన్నారో తెలియదు కానీ..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి.. పవన్ కల్యాణ్ వార్నింగ్..

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని ఉద్యోగం ఇస్తామని పిలిపించి.. ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ వ్యక్తి ఆమె మీద తన కారులోనే ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ దారుణం మొత్తాన్ని వీడియో తీశారు. అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెబితే..  ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశారు. దీనికి బయపడ్డ యువతి.. కొద్ది రోజులు కామ్ గా ఉంది. ఆ తర్వాత, ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో పోలీసులు అనుభవ్ అనే వ్యక్తి తో పాటు మరో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ఉద్యోగం ఇప్పిస్తానని మాళవియా నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారన్న 19 ఏళ్ల యువతి ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు గ్యాంగ్‌రేప్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు ఆమెకు ఉద్యోగం ఆఫర్ చేశాడని పోలీసులు గురువారం తెలిపారు. ఉద్యోగం కోసం ఆ వ్యక్తి తనను మెట్రో స్టేషన్‌కు రమ్మని అడిగాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఢిల్లీ వాసి మాలవ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. మహిళ ఫిర్యాదు ప్రకారం, తనకు ఉద్యోగం అవసరమైనప్పుడు 2020 సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా అనుభవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం గురించి చర్చించేందుకు మాలవ్య నగర్ మెట్రో స్టేషన్‌కు రావాలని అనుభవ్ తనను పిలిచాడని ఆమె చెప్పింది. 

ఆమె అక్కడికి చేరుకునేసరికే అనుభవ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కారులో ఆమె కోసం వేచి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆమెను కారులో ఎక్కించుకున్న తరువాత కొద్ది దూరం మామూలుగానే వెళ్లారు. ఆ తర్వాత, వారు బేగంపూర్ ప్రాంతంలో ఎక్కడో కారును పార్క్ చేసారు. అక్కడ వారిలో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, దుండగులు తన వీడియోను కూడా రూపొందించారు. పోలీసుల వద్దకు వెళితే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 376డి (గ్యాంగ్‌రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు), అలాగే లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం