రాయ‌ల‌సీమ‌కు రాబోతున్నస‌ముద్ర తీరం..ఎలాగంటే ?

Published : Jan 29, 2022, 10:09 AM IST
రాయ‌ల‌సీమ‌కు రాబోతున్నస‌ముద్ర తీరం..ఎలాగంటే ?

సారాంశం

కొన్ని రోజులు తరువాత రాలయసీమకు సముద్ర తీరం రాబోతోంది. ఇది అసాధ్యం అయ్యే పనే కానీ.. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయంతో ఇది సాధ్యం కానుంది. ప్రభుత్వం అనుకున్నట్టు అన్నీ సక్రమంగా జరిగితే తెలుగు కొత్త సంవత్సరం(ఉగాది)లో సముద్రతీరం రాయలసీమ పరిధిలోకి రానుంది. 

ఆప‌రేష‌న్ దుర్యోధన సినిమాలో హీరో శ్రీకాంత్ ఓ డైలాగ్ చెబుతారు. ‘‘నేను ఎన్నిక‌ల్లో గెలిస్తే హైద‌రాబాద్ కు స‌ముద్రాన్ని తీసుకొస్తాను’’ హామీ ఇస్తాడు. ‘‘హైద‌రాబాద్ కు సముద్రం ఎలా తీసుకొస్తారండి బాబు.. ఆయ‌నకు మ‌తి ఉండే మాట్లాడుతున్నాడా ?’’ అని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కౌంట‌ర్ ఇస్తారు. త‌న మాట‌ను శ్రీకాంత్ మ‌ళ్లీ ఎలాగో క‌న్విన్స్ చేస్తారు. ఇది సినిమా వ‌ర‌కే ప‌రిమితం. కానీ ఇప్పుడు రాయ‌ల‌సీమ‌కు స‌ముద్రం రాబోతుంది అంటే మీరు న‌మ్ముతారా ? అది ఎలా సాధ్య‌మ‌వుతుంది అంటారా ? కానీ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న కొత్త నిర్ణ‌యం వ‌ల్ల ఇది సాకారం కానుంది. అది ఎలాగో తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, నాన్-కోస్తా జిల్లాల మధ్య చారిత్రక అన్యాయాలను మసకబారుస్తూ.. రాయలసీమ ప్రాంతం ఇప్పుడు కోస్తా ప్రాంతంగా మార‌నుంది. తిరుపతి కేంద్రంగా ఉన్న శ్రీ బాలాజీ జిల్లాలు నెల్లూరులోని కొంత భాగాన్ని తమ పరిధిలోకి తెచ్చుకుంటున్నాయి. ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణ‌యంతో ఈ అద్భుతం సాధ్యంకానుంది. 

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అనే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతిపాదిత తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తాయి. రాయలసీమలో సతీష్ ధావన్ రాకెట్ లాంచ్ స్టేషన్ మరియు పులికాట్ సరస్సు కూడా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో ద్వీపం శ్రీహరికోటకు పశ్చిమాన సూళ్లూరుపేట 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి భారతదేశం తన రాకెట్లను ప్రయోగిస్తుంది. పులికాట్ సరస్సు సూళ్లూరుపేట, శ్రీహరికోటలను వేరు చేస్తుంది. ఇది సగటున 11 మీటర్లు (36 అడుగులు) ఎత్తులో ఉంది.

కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ ప్రాంతం చారిత్రాత్మకంగా నిలిచి ఉంది. నంద్యాల, శ్రీ అన్నమయ్య రాయచోటి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలతో నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించ‌నున్నారు. అయితే కర్నూలు జిల్లాకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, అనంతపురంకు నీలం సంజ్వా రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ రెండు జిల్లాలకు రెడ్డిల పేరు పెట్టాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం కోరుతోంది. కొత్త జిల్లాల విభజన అశాస్త్రీయమని, సాగునీటి కోసం నదీజలాలపై ఆధారపడిన రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చడం లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి (ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్) వాదిస్తోంది. 

అలాగే, నంద్యాల జిల్లాకు పీవీ నరసింహారావు నంద్యాల జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. నంద్యాలకు మాజీ ప్రధాని పేరు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ పీవీ కుమార్తె సురభి వాణి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ పంపినట్లు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు బొజ్జా దశరథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం ఏపీలో 40 శాతం ఆక్ర‌మించి ఉంద‌ని అన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా ప్రకటించిన జిల్లాల కంటే ఈ ప్రాంతానికి ఎక్కువ జిల్లాలు అవసర‌మ‌ని తెలిపారు. మదనపల్లె, గుంతకల్లు, ఆదోని వంటి ప్రాంతాలను జిల్లాలుగా మార్చవచ్చని సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్