coast guard: బోటులో మంటలు, కాకినాడలో 11 మంది మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డు సిబ్బంది

Published : Dec 01, 2023, 11:15 AM ISTUpdated : Dec 01, 2023, 11:20 AM IST
coast guard: బోటులో మంటలు, కాకినాడలో 11 మంది  మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డు సిబ్బంది

సారాంశం

చేపల వేటకు  వెళ్తున్న 11 మంది మత్స్యకారులను  కోస్ట్ గార్డు సిబ్బంది  కాపాడారు. దీంతో ఆయా కుటుంబాల సభ్యులు  ఊపిరి పీల్చుకున్నారు. 

కాకినాడ: చేపల వేటకు వెళ్తున్న బోటులో  అగ్ని ప్రమాదం జరగడంతో   11 మంది మత్స్యకారులను   కోస్ట్ గార్డు  సిబ్బంది  వారిని కాపాడారు. సముద్రంలో  బోటులో  చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారుల బోటులో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోటులోని గ్యాస్ సిలిండర్  పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని  ఇతర మత్స్యకారులతో పాటు కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  దీంతో  వెంటనే  కోస్ట్ గార్డు సిబ్బంది  కాకినాడ తీరంలో  గాలింపు చర్యలు చేపట్టారు.  కాకినాడ తీరంలో  ప్రమాదానికి గురైన బోటులోని  11 మంది మత్స్యకారులను రక్షించారు.  అగ్ని ప్రమాదం కారణంగా లైఫ్ జాకెట్ తో  సముద్రంలో దూకిన  వారితో పాటు  బోటులోనే ఉన్నవారిని కోస్ట్ గార్డు సిబ్బంది సురక్షితంగా కాపాడారు. 

సముద్రంలో చేపల వేటకు  కనీసం వారం రోజుల పాటు  మత్య్సకారులు వెళ్తారు.  వారం రోజుల పాటు తమకు అవసరమైన ఆహారం తీసుకెళ్తారు. కొన్ని సమయాల్లో  భోజనం వండుకొనేందుకు అవసరమైన సరుకులు, గ్యాస్ సిలిండర్ ను కూడ తీసుకెళ్తారు. బోటులోని   గ్యాస్ సిలిండర్  పేలుడుతో ప్రమాదం జరిగింది.   గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో  మత్స్యకారులు కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు  ఇతర మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోస్ట్ గార్డు సిబ్బంది ప్రమాదానికి గురైన  11 మంది మత్స్యకారులను  రక్షించారు.


 

PREV
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu