కనగాపల్లి వైసీపీలో విభేదాలు.. చెప్పులతో దాడులు చేసుకున్న ఇరువర్గాలు..

By Sumanth KanukulaFirst Published May 29, 2023, 3:38 PM IST
Highlights

శ్రీసత్యసాయి జిల్లాలోని  కనగాపల్లి మండలం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నాయి. 

శ్రీసత్యసాయి జిల్లాలోని  కనగాపల్లి మండలం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నాయి. వివరాలు.. కనగాపల్లి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో కొనపురం గ్రామానికి చెందిన వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. అంతా చూస్తుండగానే దాడులు చేసుకన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. అయితే పోలీసులు వారించేందుకు యత్నించినప్పటికీ ఇరువర్గాలు పట్టించుకులేదు. చెప్పులతో దాడులు చేసుకోవడమే కాకుండా.. దూషణలకు దిగారు. అయితే కొంతసేపటికి అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

click me!