టికెట్ కోసం చంద్రబాబుని కలిసిన సినీ నిర్మాత

Published : Feb 22, 2019, 09:49 AM IST
టికెట్ కోసం చంద్రబాబుని కలిసిన సినీ నిర్మాత

సారాంశం

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఎగపడుతున్నారు.

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఎగపడుతున్నారు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో.. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ముఖ్య పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా.. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాగా.. సినీ నిర్మాత, చిత్తూరుు ఎంపీ శివప్రసాద్ పెద్ద అల్లుడు వేణుగోపాల్ గురువారం చంద్రబాబుని కలిశారు. తనకు సత్యవేడు టికెట్ కేటాయించాలని కోరారు. తాను ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతలా కృషి చేశానో ఈ సందర్భంగా వేణుగోపాల్ చంద్రబాబుకి వివరించారు.

తన బయోడేటాను పార్టీ అధినేతకు అందించారు. కాగా, ఎంపీ శివప్రసాద్‌ రెండో అల్లుడు నరసింహ ప్రసాద్‌కు రైల్వేకోడూరు అభ్యర్థిత్వం ఖరారైంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu