లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు

Published : Dec 26, 2018, 05:24 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు

సారాంశం

 కర్నూల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీమోహన్ రెడ్డికి  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు.  వర్మ తన లాయర్ ద్వారా ఈ నోటీసును పంపారు.  


కర్నూల్: కర్నూల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీమోహన్ రెడ్డికి  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు.  వర్మ తన లాయర్ ద్వారా ఈ నోటీసును పంపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో  వెన్నుపోటు పాటను వర్మ యూట్యూబ్‌లో ఇటీవల  విడుదల చేశారు. ఈ పాట ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కించపర్చే విధంగా ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ పాటపై కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  వర్మ గతంలోనే స్పందించారు.అయితే తనను వేధింపులకు గురి చేసేందుకే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని రామ్‌గోపాల్ వర్మ ఆరోపిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి  రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు. 48 గంటల్లోపుగా తనకు క్షమాపణ చెప్పి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆ నోటీసులో వర్మ కోరారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని  ఆయన హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్
మీ ఇంట్లో ఇలాంటి భోజనం తింటారా.? Food Commission Chairman Inspection In MJPAPBCW Residential School