అమరావతి అసైన్డ్ భూముల కేసు: టీడీపీ హయంలో జీవోలపై సీఐడీ ఆరా

Published : Mar 28, 2021, 02:25 PM IST
అమరావతి అసైన్డ్ భూముల కేసు: టీడీపీ హయంలో జీవోలపై సీఐడీ ఆరా

సారాంశం

అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు జారీ చేసిన జీవోలతో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఈ ఏడాది  ఫిబ్రవరిలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.టీడీపీ హయంలో జీవోల జారీకి సంబంధించిన ఆధారాలను సీఐడీ సేకరించే ప్రయత్నం చేస్తోంది.అసైన్డ్ , లంక భూముల జీవోల వెనకున్న నోట్ ఫైల్స్ ను  సీఐడీ సేకరిస్తోంది.

రైతుల నుండి సేకరించిన ఆధారాలు, నోట్ ఫైల్స్ ను కోర్టుకు  సీఐడీ అందజేయనుంది.భూముల అక్రమాల్లో నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్స్ ఉందంటోన్న సీఐడీ అధికారులు.అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను కూడ సమర్పించింది.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu
CM Chandrababu: నిడదవోలులో సరస్సును పునరుద్ధరణకు పరిశీలించిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu