కరోనాఎఫెక్ట్: విశాఖ షిప్‌యార్డ్‌కు చైనా నౌకకు నో ఎంట్రీ

Published : Mar 06, 2020, 01:59 PM IST
కరోనాఎఫెక్ట్: విశాఖ షిప్‌యార్డ్‌కు చైనా నౌకకు నో ఎంట్రీ

సారాంశం

విశాఖపట్టణం షిప్‌యార్డుకు చైనా నౌక వచ్చింది. చైనా నుండి ఈ నౌక రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌక విశాఖ షిప్‌ యార్డులో సరుకులను దించుకొనేందుకు  నెల రోజుల క్రితమే అనుమతి తీసుకొన్నారు.

విశాఖపట్టణం:విశాఖపట్టణం షిప్‌యార్డుకు చైనా నౌక వచ్చింది. చైనా నుండి ఈ నౌక రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌక విశాఖ షిప్‌ యార్డులో సరుకులను దించుకొనేందుకు  నెల రోజుల క్రితమే అనుమతి తీసుకొన్నారు. కరోనా భయంతో ఈ నౌక చైనా నుండి రావడంతో ఇందులో ఉన్న వారిని పరీక్షించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

చైనా నుండి  ఫార్చూన్ నౌక  విశాఖపట్టణానికి గురువారం నాడు సాయంత్రం చేరుకొంది. చైనా నుండి  సరుకులను తీసుకొని ఈ నౌక విశాఖపట్టణానికి చేరుకొంది. ఈ నౌకలో 22 మంది ఉన్నారు. వీరిలో 17 మంది చైనీయులు ఉన్నారు. మిగిలిన ఐదుగురు మయన్మార్‌కు చెందినవారు ఉన్నారు.

చైనాలో‌  కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో చైనా నుండి ఈ నౌక రావడంతో ఈ నౌకలో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించిన తర్వాతే  షిప్‌యార్డు
అనుమతించాలని  అధికారులు నిర్ణయించారు.

షిప్‌ను అవుటర్ హర్బర్‌లోనే ఉంచారు. ఈ నౌకలో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే  కార్గో హ్యండిలింగ్‌కు అనుమతి ఇస్తారు. గత నెల 27న  నౌక  చైనా నుండి సింగపూర్‌కు వెళ్లింది. అక్కడి నుండి నౌక తిరిగి విశాఖపట్టణానికి చేరుకొంది.

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu