అమరావతి మండలం జూపూడిలో శివాజీ విగ్రహం ధ్వంసం: ఉద్రిక్తత

By narsimha lodeFirst Published May 2, 2023, 9:40 AM IST
Highlights

  అమరావతి మండలం జూపూడిలో  శివాజీ విగ్రహన్ని  గుర్తు తెలియని వ్యక్తులు  నిన్న రాత్రి ధ్వంసం  చేశారు.  ఈ విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

అమరావతి: పల్నాడు  జిల్లాలోని అమరావతి మండలం జూపూడిలో   ఉద్రిక్తత చోటు  చేసుకుంది.   ఛత్రపతి శివాజీ విగ్రహన్ని గుర్తు తెలియని దుండగులు  సోమవారంనాడు రాత్రి
ధ్వంసం  చేశారు. విగ్రహం తల, మొండెం వేరు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పోలీసుల సూచన మేరకు  విగ్రహనికి తలను, మొండెం  అతికించారు.  భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు  పునరావృతం కాకుండా ఉండేందుకు గాను  విగ్రహం ఏర్పాటు  చేసిన చోట సీసీ కెమెరాలను  ఏర్పాటు  చేయాలని  స్థానికులు డిమాండ్  చేస్తున్నారు. 

ఈ గ్రామంలో  రెండు  సామాజిక వర్గాల మధ్య   గతంలో వివాదాలు చోటు  చేసుకున్నాయి.  ఈ గొడవలు  పోలీస్ స్టేషన్ల వరకు  చేరాయి.   ఈ గొడవల నేపథ్యంలోనే  ఈ ఘటన చోటు  చేసుకుందా  మరే ఇతర కారణాలున్నాయా  అనే  విషయమై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహన్ని ధ్వంసం  చేసిన  వారెవరనే విషయమై  పోలీసులు విచారిస్తున్నారు.  

Latest Videos

click me!