ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు మేనల్లుడు ఉదయ్ కుమార్(43) మృతి చెందారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు మేనల్లుడు ఉదయ్ కుమార్(43) మృతి చెందారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్ కుమార్ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈ ఉదయమే కేర్ ఆస్పత్రిలో చేరిన ఉదయ్కుమార్ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్కుమార్. విషయం తెలిసిన చంద్రబాబు మరికాసేపట్లో అమరావతి నుంచి హైదరాబాద్కు రానున్నారు.