చంద్రబాబుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Published : Oct 08, 2018, 08:34 PM IST
చంద్రబాబుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యం ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యం ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అందజేయనున్నారు. 

వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ ఈ అంశాలను పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. కమిటీ పరిశీలించిన అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో అవార్డుకు చంద్రబాబు నాయుడును ఎంపిక చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu