చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ.. ‘‘కలవడానికెందుకురా తొందరా ’’ అంటూ మంత్రి అంబటి సెటైర్లు

Published : Apr 30, 2023, 08:20 AM ISTUpdated : Apr 30, 2023, 08:22 AM IST
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ.. ‘‘కలవడానికెందుకురా  తొందరా ’’ అంటూ మంత్రి అంబటి సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం భేటీ అయ్యారు. ఈ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగస్త్రాలు సంధించారు. 

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కలవడానికి ఎందుకు అంతగా తొందర పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

హన్మకొండలో ఘోరం.. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన వివాహిత.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని..

ఆ ట్వీట్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్ ఉద్దేశించి వ్యంగస్త్రాలు సంధించారు. ‘‘కలవడానికెందుకురా  తొందరా ! ఎదర బ్రతుకంతా చిందర వందర !! ’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఇరు పార్టీల నాయకులు గతంలోనూ భేటి అయ్యారు. అయితే తాజాగా శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

ఇందులో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించారని సమాచారం. వీరి భేటీ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో పవన్ సమావేశం కావడం ఇది మూడోసారి. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ ఆయనకు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu