Chandrababu arrest: ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టేందుకు జగన్ కుట్ర.. రాజవోలులో టీడీపీ నేతల జల దీక్ష

By Mahesh RajamoniFirst Published Sep 26, 2023, 5:13 PM IST
Highlights

Rajamahendravaram: అంగళ్ల కేసులో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగియగా, పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండ‌గా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కస్టడీ పిటిషన్ తో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది.
 

TDP leaders Jala Deeksha: తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అరెస్టుకు వ్య‌తిరేకంగా టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వారు విభిన్న రీతుల్లో త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఆయనను ఎదుర్కొనే దమ్ము లేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి  టీడీపీ చంద్రబాబును  అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామ చెరువులో చంద్రబాబు నాయుడికి మద్దతుగా రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు జలదీక్ష చేప‌ట్టాయి. నగ్నంగా ప్రదర్శన నిర్వహించి సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి తీరుపై మండిప‌డ్డారు.

ఆందోళనకు నేతృత్వం వహించిన రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడమే జగన్ మోహ‌న్ రెడ్డి కుట్ర అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ ఆందోళనలో నిమ్మలపూడి రామకృష్ణ, వజ్జన్ కుమార్, కంటిపూడి బాబీ, పల్లా రామస్వామి యాదవ్, నీలి కోటేశ్వరరావు, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు, అంగర రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలావుండ‌గా, అంగళ్ల కేసులో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగియగా, పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించగా, ప్రాసిక్యూషన్ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అలాగే, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కస్టడీ పిటిషన్ తో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది.

click me!