ఏపీ వరదలు: నవంబర్‌ రెండో వారంలో రాష్ట్రానికి కేంద్ర బృందం

Siva Kodati |  
Published : Oct 31, 2020, 04:53 PM IST
ఏపీ వరదలు: నవంబర్‌ రెండో వారంలో రాష్ట్రానికి కేంద్ర బృందం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానున్నట్లుగా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానున్నట్లుగా తెలుస్తోంది.

నవంబర్ 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారులు.. పంట నష్టం వివరాలను సిద్ధం చేస్తున్నారు.

మొత్తం 12 శాఖల్లో వరదల వల్ల నష్టం సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు రూ.10 వేల కోట్ల వరకు పంట, ఆస్తి నష్టం జరిగినట్లు ఓ అంచనా. దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, సుమారు రెండున్నర లక్షల మంది రైతులకు వరదలు కన్నీరు మిగిల్చాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో అక్వా రంగం దారుణంగా దెబ్బతింది. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: అమరావతి అంతులేని కథ చంద్రబాబు పై అంబటి సెటైర్లు| Asianet News Telugu
Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu