వైఎస్ వివేకానందరెడ్డి కేసు: మర్డర్ స్థలంలో 3 గంటల పాటు సీబీఐ పరిశీలన

By narsimha lodeFirst Published Apr 12, 2021, 9:55 PM IST
Highlights

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పోమవారంనాడు సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు.

కడప: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పోమవారంనాడు సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా వివేకా పీఏ హిదయతుల్లాను ప్రశ్నించారు. వివేకా ముఖ్య అనుచరుడు యర్ర గంగిరెడ్డిని కూడా సీబీఐ బృందం నిశితంగా విచారించింది.

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు:సీబీఐ విచారణ మళ్లీ షురూ

 ఇటీవల వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దోషులెవరో తేల్చాలని కోరారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిన కొన్నిరోజుల్లోనే సీబీఐ అధికారులు పులివెందుల రావడం ఆసక్తి కలిగిస్తోంది.రెండేళ్లైనా ఈ కేసులో నిందితులను తేల్చకపోవడంపై  వివేకానందరెడ్డి కూతురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు 2019 మార్చి 14వ తేదీన హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
 

click me!