వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: రెండు వాహనాల్లో ఆఫీసర్లు

Published : Jan 25, 2023, 03:10 PM ISTUpdated : Jan 25, 2023, 04:19 PM IST
వైఎస్ అవినాష్ రెడ్డి  ఇంటికి  సీబీఐ అధికారులు: రెండు వాహనాల్లో ఆఫీసర్లు

సారాంశం

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి ఇవాళ  సీబీఐ అధికారులు వెళ్లారు.  రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి వచ్చారు. 

కడప: వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి ఇంటికి  బుధవారం నాడు  సీబీఐ అధికారులు వెళ్లారు.  రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు  అవినాస్ రెడ్డి ఇంటికి వచ్చారు.   ఇవాళ ఉదయమే  అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు  నోటీసులు అందించారు. ఈ నెల  23వ తేదీన  పులివెందులలో  ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసాన్ని   సీబీఐ అధికారులు  పరిశీలించారు.  అదే రోజున  వైఎస్ అవినాష్ రెడ్డికి  నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  విచారణకు రావాలని   ఈ నొటీసులో  పేర్కోన్నారు సీబీఐ అధికారులు. అయితే   ముందుగా  నిర్ధయించిన షెడ్యూల్ కారణంగా  తాను  విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి  సీబీఐకి లేఖ రాశాడు.ఈ లేఖ ఆధారంగా  ఇవాళ   మరోసారి  అవినాష్ రెడ్డికి  సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.  ఈ నెల  28వ తేదీన   విచారణకు రావాలని సీబీఐ  ఆ నోటీసులో  పేర్కొంది. 

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

2019  మార్చి  19న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు .  ఈ హత్య కేసుకు సంబంధించి  సీబీఐ విచారణ నిర్వహిస్తుంది.  వైఎస్ వివేకానందరెడ్డి    హత్య  కేసును సీబీఐకి అప్పగించాలని  కోరుతూ  వివేకానందరెడ్డి కూతురు  సునీతా రెడ్డి  పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిలు పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.    ఈ కేసు విచారణను  ఏపీ రాష్ట్రం నుండి  కాకుండా  మరో రాష్ట్రానికి  తరలించాలని వైఎస్ సునీతారెడ్డి  పిటిషన్ ను  సుప్రీంకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసింది..ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఉన్నత న్యాయస్థానం  తెలంగాణకు  విచారణను బదిలీ చేసింది.   


 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu