రాజా, కనిమొళి నిర్దోషులే

Published : Dec 21, 2017, 11:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రాజా, కనిమొళి నిర్దోషులే

సారాంశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ కేసులో నిందుతలను నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ కేసులో నిందుతలను నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. పాటియాల హౌస్ కోర్టు గురువారం ఉదయం ఇచ్చిన తీర్పుతో డిఎంకె పార్టీలో సంబరాలు ఆకాశాన్నంటాయి. 2 స్పక్ట్రమ్ లో దాదాపు 2 లక్షల కోట్ల మేర కుంభకోణం జరిగిందని యుపిఏ హయాంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి అందరకీ తెలిసిందే. పాటియాల్ కోర్టు తన తీర్పులో ప్రధాన నిందుతులుగా సిబిఐ పేర్కొన్న కనిమొళి, రాజాలపై కేసులను కొట్టేసింది. ఈ కేసుపై దాదాపు ఏడేళ్ళుగా కోర్టులో విచారణ సాగింది. సరిగ్గా ఆర్కె నగర్ ఉపఎన్నిక జరుగుతున్న రోజే ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె నేతలిద్దరూ నిర్దోషులుగా విడుదలవ్వటం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసినపుడు రాజానే టెలికం మంత్రిగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

సాయికృష్ణ ఇంటికి వద్ద జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Sensational Press Meet at Sai Krishna House
కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ | YS Jagan Visits Gade Sai Krishna Family