ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై నిందలు: నారా లోకేష్ మీద అనంత జిల్లాలో కేసు

Published : May 08, 2021, 05:17 PM IST
ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై నిందలు: నారా లోకేష్ మీద అనంత జిల్లాలో కేసు

సారాంశం

అనంతపురం జిల్లా డి హీరేలాల్ పోలీసు స్టేషన్ లో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ మీద కేసు నమోదైంది. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద అనంతపురం జిల్లా డీ.హీరేలాల్ పోలీసు స్టషన్ లో కేసు నమోదైంది.

కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అంటగడుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. దానిపై రాష్ట్ర ఎస్ సెల్ కార్యదర్శి భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లే విధంగా లోకేష్ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. 

ఆ ఫిర్యాదు మేరకు నారా లోకేష్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 111/2021  సెక్షన్ల కింద ఆయన కేసు నమోదైంది. ఆయనపై 153(ఎ), 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

కర్నూలులో కరోనా వేరియంట్ మీద వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu