రాజధాని విభజనకు రెండు ఆప్షన్లు: బీసీజీ నివేదికలోని ముఖ్యాంశాలివే..!!!

By sivanagaprasad KodatiFirst Published Jan 3, 2020, 8:08 PM IST
Highlights

బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళిక విభాగ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కమిటీ సభ్యులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ఆయన తెలిపారు

బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళిక విభాగ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కమిటీ సభ్యులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ఆయన తెలిపారు. అభివృద్ధికి ఏ విధానాలు చేపట్టాలో నివేదికలో స్పష్టంగా తెలిపారని.. 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా సంస్థ పరిశీలించిందన్నారు.

ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైన వనరులున్నాయో పరిశీలించడం జరిగిందన్నారు. 2.25 లక్షల కోట్ల రుణాలు ఏపీకి ఉన్నాయని.. వ్యవసాయ ఉత్పాదకతలో ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిందని విజయ్ తెలిపారు.

బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలోని అంశాలు:

* ఆప్షన్ వన్ సెక్రటేరియేట్ వివిధ శాఖల కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ సమావేశాలు విశాఖలో పెట్టుకోవచ్చు
* అమరావతిలో అసెంబ్లీ, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ పెట్టుకోవచ్చు
* కర్నూలులో హైకోర్టు.. ఆప్షన్-2లో విశాఖలో సెక్రటేరియేట్, సీఎం, గవర్నర్ కార్యాలయాలు, వివిధ శాఖల కార్యాలయాలు, అమరావతిలో అసెంబ్లీ హైకోర్టులో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ 

* రాజధాని విభజనకు రెండు ఆప్షన్లు ఇచ్చిన బోస్టన్ రిపోర్ట్
* 2009లో వచ్చిన వరదలో ఇప్పుడు అమరావతిగా చెబుతున్న ప్రాంతం మునిగిపోయింది
* అమరావతిలో ఐదు కిలోమీటర్ల పరిధి వరకూ నిర్మాణాలు చేపట్టకూడదు
* 25 శాతం ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం అమరావతికి వచ్చారు
* కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

* హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును అభివృద్ధి చేయాలి
* బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపూర్‌ను అభివృద్ధి చేయాలి
* కృష్ణా, గుంటూరు జిల్లాలను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలి
* శాసనసభకు విజయవాడ మొదటి ప్రాధాన్యమైతే, రెండో ప్రాధాన్యత విశాఖపట్నం
* జ్యుడీషియరీకి మొదటి ప్రాధాన్యత కర్నూలు, రెండో ప్రాధాన్యత అమరావతి

* రాష్ట్రానికి మరిన్ని పోర్టులు అవసరం
* మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా వ్యవస్ధలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
* దక్షిణాదిలోనే ఏపీలో తక్కువ తలసరి ఆదాయం ఉంది
* కర్నూలు, కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది.

* చైన్నై నుంచి విశాఖ వరకు ఉన్న రైలు మార్గాన్ని ఆధునీకరణ చేయాలి
* అక్షరాస్యతలోనూ జాతీయ సగటు కన్నా ఏపీలో తక్కువ
* రాష్ట్రంలోని ప్రకృతి సంపదను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు
* ప్రకృతి సంపదపై కీలక సూచనల
* కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాగు తక్కువ
* పర్యాటకం విషయంలోనూ చాలా తక్కువ అభివృద్ధి. కేరళతో పోలిస్తే ఏపీలో టూరిజం అభివృద్ధి చెందలేదు
* రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
* ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా తయారు చేయవచ్చు, కాఫీ, జీడిపంటలు పెంచుకోవచ్చు

* విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది
* అమరావతి రాజధానికి రుణం తెస్తే... పదివేల కోట్లు వడ్డీ కట్టాలి.
* అమరావతిలోని భూముల అమ్మకాల ద్వారా వచ్చే నిధులు సరిపోవు
* లక్షా పదివేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం అవసరమా.
* పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్ధిక భారం, అసలు ప్రభుత్వం వద్ద లక్ష కోట్లు ఉన్నాయా
* ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రం... అంత పెట్టుబడి పెట్టడం అవసరమా..?
* నీటిపారుదలపై పెట్టుబడులు పెడితే ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి.
* అమరావతిపై వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోతుంది.
* అమరావతిపై కంటే ఆ డబ్బును అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది
 

Read Also:

మా భూములపై విచారణ చేస్తే.. వైఎస్ భారతిపైనా జరపాలి: ధూళిపాళ్ల నరేంద్ర

జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

click me!