తూర్పుగోదావరిలో విషాదం.. గోదావరిలో నాటు పడవ బొల్తా.. పడవలో 30 మంది

Published : Jul 14, 2018, 05:13 PM ISTUpdated : Jul 14, 2018, 05:36 PM IST
తూర్పుగోదావరిలో విషాదం.. గోదావరిలో నాటు పడవ బొల్తా.. పడవలో 30 మంది

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరిలో నాటు పడవ బొల్తా పడింది. ముమ్ముడివరం మండలం పశువులలంక వద్ద ప్రయాణికులతో వెళుతున్న పడవ బొల్తాపడింది

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరిలో నాటు పడవ బొల్తా పడింది. ముమ్ముడివరం మండలం పశువులలంక వద్ద ప్రయాణికులతో వెళుతున్న పడవ బొల్తాపడింది.  ప్రమాదాన్ని చూసిన స్థానికులు, మత్య్సకారులు 10 మందిని సురక్షితంగా తీసుకొచ్చారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు.. అయితే 30 మంది వరకు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు... ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్