శ్రీకాకుళం జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో పేలుడు: ఇద్దరికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 3, 2021, 3:22 PM IST
Highlights


శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కచేరి వీధిలో ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా Tekkali మండలం Kacheri Veedhi లో ఓ ఇంట్లో బుధవారం నాడు Blast చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.కచేరి వీధిలోని ఇంట్లో  బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాాల్సి ఉంది.

also read:బాణసంచా వాడకంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఎన్సీఆర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో నిషేధం..

గతంలో కూడా ఇంట్లో బాణసంచా చేస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహ ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని  శ్రీకాకుళం జిల్లాలో 2016  ఏప్రిల్ 18న గురువాంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఇద్దరు మరణించారు.  మరో ఏడుగురు గాయపడ్డారు.

ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖ జిల్లా రావికమతం మండలం మేడివాడలో ఓ ఇంట్లో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో పేలుడు వాటిల్లింది.ఈ ఘటనలో ఓ వృద్దురాలు సజీవదహనం కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.2019 అక్టోబర్ మాసంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి.

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణసంచా దుకాణంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. దీపావళిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ దుకాణంలో బాణసంచాను నిల్వ ఉంచారు. అయితే ఈ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు చోటు చేసుకొంది.

click me!