తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంబవించింది.ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
తాళ్లరేవులో శుక్రవారం నాడు ఓ బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.ఈ షార్ట్ సర్క్యూట్ తో బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో బాణసంచా పేలుడులో బాణసంచా దుకాణం నిర్వహకుడితో పాటు 9 మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
నెల రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలోని వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు.మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం.
ఈ ఘటన తర్వాత అగ్నిమాపక సిబ్బంది సరైన విధంగా తనిఖీలే చేయని కారణంగా అదే రకమైన ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండానే బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వంటి ఘటనలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి.
ఇటీవలనే కొత్తపేట ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాలపై అగ్నిమాపక అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వల్ల ఈ తరహా ప్రమాదాలు చోటు చుేసుకొంటున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలోనే అధికారులు హాడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుందని స్థానికులు అభిప్రాయంతో ఉన్నారు.