రేణిగుంట రైల్వే ట్రాక్‌పై పేలుడు: మహిళకు తీవ్ర గాయాలు

Published : Dec 08, 2020, 04:40 PM ISTUpdated : Dec 08, 2020, 05:18 PM IST
రేణిగుంట రైల్వే ట్రాక్‌పై పేలుడు: మహిళకు తీవ్ర గాయాలు

సారాంశం

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ పై  మంగళవారం నాడు పేలుడు కలకలం సృష్టించింది.


రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ పై  మంగళవారం నాడు పేలుడు కలకలం సృష్టించింది.రేణిగుంట సమీపంలో పట్టాలపై ఓ పెట్టె పడిపోయి ఉండటాన్ని గుర్తించిన మహిళ  పెట్టెను తెరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పెట్టె ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మహిళకు గాయాలయ్యాయి.

రైలు పట్టాలపై ఈ బాక్స్ ను ఎవరు పెట్టారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  రైల్వే ట్రాక్ కు కూడ  స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా  అధికారులు చెబుతున్నారు.ఈ పేలుడు సంభవించిన సమయంలో ఈ మార్గంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు సాగలేదు. దీంతో  పెను ప్రమాదం తప్పిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఈ పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. 

గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ కుడి చేయికి తీవ్రంగా గాయలయ్యాయి. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద  ఎత్తున శబ్దం విన్పించిందని స్థానికులు చెప్పారు. ఈ శబ్దం  విన్న స్థానికులు వచ్చి చూడడంతో మహిళ గాయపడి ఉంది. వెంటనే ఆమెకు అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన మహిళను శశికళగా గుర్తించారు. ఈ ప్రాంతంలో అడవి పందులను చంపేందుకు ఈ తరహా పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తారని పోలీసులు చెప్పారు. అడవి పందుల కోసం తెచ్చిన పేలుడు పదార్ధాలా.. లేక ఇంకా దేని కోసం ఈ పేలుడు పదార్ధాలను తెచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శశికళ కుడి చేయి వేళ్లు తెగిపోయాయి. ఆమెకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని పోలీసులు కోరారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ధురంధర్ YS Sharmila కీలక వ్యాఖ్యలు | Viral | Asianet News Telugu
Garikapati Gurajada : గరికపాటి నరసింహరావు గుడ్డు వివాదం.. అసలు ఈయన కొడుకు ఏం చేస్తారో తెలుసా..?