స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వ నిధులు.. విష్ణువర్థన్ రెడ్డి..(వీడియో)

Published : Jan 25, 2021, 04:40 PM IST
స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వ నిధులు.. విష్ణువర్థన్ రెడ్డి..(వీడియో)

సారాంశం

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల మీద సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడలో తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల మీద సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడలో తెలిపారు. 

"

పంచాయతీ ఎన్నికలు జరిగితే పాలకవర్గాలు ఏర్పడతాయి. అప్పుడే కేంద్రం నుండి భారీగా నిధులు వస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో  బీజేపీ,జనసేన మద్దతు దారులు విజయం సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికలు శాంతియుతంగా జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గతంలో జరిగిన ఏన్నికకు సంబందించి ఏకగ్రీవాలు రద్దుచేసి ఎన్నిక జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ. అది జరగాలని ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ సంయుక్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పుకొచ్చారు..

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్