జగన్‌పై మా పార్టీ సీరియస్‌గా వుంది .. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే : సీఎం రమేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 14, 2023, 07:50 PM IST
జగన్‌పై మా పార్టీ సీరియస్‌గా వుంది .. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే : సీఎం రమేశ్ వ్యాఖ్యలు

సారాంశం

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్‌గా వుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం రమేష్ జోస్యం చెప్పారు. 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్‌గా వుందన్నారు. వైసీపీ సర్కార్‌ను ఉపేక్షించే స్థితిలో కేంద్రం లేదని.. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై కూడా దాడులు జరుగుతున్నాయని.. రైతు సమస్యలను జగన్ పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పది రూపాయలు ఇచ్చి, 100 లాక్కుంటుందని ఆరోపించారు. బీజేపీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం రమేష్ జోస్యం చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations