ఏపీలో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్.. ‘గ్రాసిమ్’ ద్వారా 2,700 కోట్ల పెట్టుబడులు: పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్

Published : Apr 19, 2022, 08:40 PM IST
ఏపీలో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్.. ‘గ్రాసిమ్’ ద్వారా 2,700 కోట్ల పెట్టుబడులు: పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు కాబోతున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ .2,700 కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి ఉద్యోగాలు రానున్నట్టు వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్‌ ఏర్పాటు కానున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఏప్రిల్ 21వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. ఈ గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ. 2,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి వివరించారు. తద్వార 2,450 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్టు తెలిపారు. అంతేకాదు, ప్రభుత్వ నిర్ణయానికి లోబడి 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి గ్రాసిమ్ అంగీకరించిందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి ఉద్యోగాలు రానున్నట్టు వివరించారు. గ్రాసిమ్ భూగర్భ జలాల కాలుష్యానికి ఆస్కారం లేకుండా యూనిట్ ఏర్పాటుకు పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 24 గంటలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

ఇది కంబైన్డ్ వాటర్ ట్రీట్‌మెంట్, ఎఫ్లూయెంట్‌ను చేర్చడానికి పూర్తిగా సవరించిన డిజైన్‌తోపాటు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సౌకర్యం గ్రాసిమ్‌లో ప్రత్యేకంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. 

ఆదిత్యా బిర్లా గ్రూపు పరిశ్రమ గ్రాసిమ్

పులివెందులలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం వైఎస్ జగన్ ఇటీవలే శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పరిశ్రమనూ సీఎం స్వయంగా ప్రారంభిస్తున్నారు. దేశంలోనే విస్కస్ స్టెపుల్ ఫైబర్, క్లోర్, ఆల్కలీ, తయారీ, సిమెంట్ తయారీ, వినార్థిక సేవల వంటివాటిలో గ్రాసిమ్ దిగ్గజ కంపెనీ. ప్రపంచంలో 500 పెద్ద కంపెనీల్లో ఒకటైన ఆదిత్య బిర్లా కంపెనీ పేరుని 1947 ఆగస్టు 25న ది గ్వాలియర్ రేయన్ సిల్క్ మానుఫాక్చరింగ్ కంపెనీ ఇప్పటికే పులివెందులలోని సంయు గ్లాస్‌ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇపుడు 
మరో  పరిశ్రమను ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించి పెట్టుబడుల ప్రవాహానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే విస్కస్ స్టెపుల్ ఫైబర్(వీఎస్ఎఫ్), క్లోర్, ఆల్కలీ తయారీ, సిమెంట్ ఉత్పత్తి, విభిన్న ఆర్థిక సేవల వాటిలో గ్రాసిమ్ దిగ్గజ కంపెనీ. ప్రపంచలో 500 పెద్ద కంపెనీల్లో ఒకటైన ఆదిత్య బిర్లా కంపెనీ పేరును 1947 ఆగస్టు 25న ది గ్వాలియర్ రేయన్ సిల్క్ మానుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌గా రిజిస్టర్ చేశారు. అనంతరం 1986లో గ్రామిస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా పేరును మార్చారు. ఇప్పటికే గుజరాాత్, ఒడిశా, జార్ఖండ్, యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. అల్యూమినియం సహా నీటి శుద్ధి, వస్త్ర పరిశ్రమ, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు, ఔషధాలు, పల్ప్, పెప్పర్, విస్కోస్ స్టెపుల్ ఫైబర్, 18 రకాల ఉత్పత్తుల తయారీతో 1000కి పైగా కస్టమర్లతో గ్రాసిమ్ యూనిట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాస్టిక్ సోడా, క్లోర్ అల్కలీ పరిశ్రమ రంగాాల్లో దేశంలోనే 29 శాతం సామర్థ్యంలో గ్రాసిమ్ పరిశ్రమ ముందంజలో ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్