ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయుల దాడి, నంద్యాలలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : May 16, 2023, 08:03 PM ISTUpdated : May 16, 2023, 09:26 PM IST
ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయుల దాడి, నంద్యాలలో ఉద్రిక్తత

సారాంశం

నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను కారులో ఎక్కించి పంపారు. 

నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సుబ్బారెడ్డిని కారులో ఎక్కించి పంపారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సాగుతోంది. ఈ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. లోకేష్ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. గొడవ మరి పెద్దది కాకుండా పోలీసులు సుబ్బారెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో నంద్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్