అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలి: మంత్రులతో జగన్

Published : Nov 27, 2020, 04:30 PM IST
అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలి: మంత్రులతో జగన్

సారాంశం

అసెంబ్లీ సమావేశాలకు  సంసిద్దంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులను కోరారు.

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు  సంసిద్దంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులను కోరారు.శుక్రవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై జగన్ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు.

also read:ఈ నెల 21 నుండి భూముల సర్వే: ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశాల్లో విపక్షానికి ధీటుగా సమాధానం చెప్పాలని జగన్ మంత్రులకు సూచించారు. ఈ మేరకు ప్రిపేరై సమావేశాలకు రావాల్సిందిగా ఆయన కోరారు. ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి హాజరైతే నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలవరం ఎత్తు విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన మంత్రులకు సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదించనుంది.ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నివర్ తుఫాన్ బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో సీఎం జగన్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సబ్సిడీతో విత్తనాలు అందించాలని సీఎం ఆదేశించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?