కట్టుకున్న వాడి కళ్లేదుటే మహిళపై చెయ్యేసి... పిడుగురాళ్లలో ఆటోవాలా వికృతచేష్టలు

By Arun Kumar PFirst Published Aug 29, 2021, 10:44 AM IST
Highlights

తన ఆటోలో ప్రయాణిస్తున్న వివాహితతో ఆమె భర్త ఎదుటే అసభ్యంగా ప్రవర్తించాడో ఆటోవాలా. అంతటితో ఆగకుండా దంపతులను చితకబాదిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: కట్టుకున్న వాడి కళ్లేదుటే మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆటోవాలా. వివాహితను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటమే కాదు ఒంటిపై చెయ్యేస్తూ వెకిలిచేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా  మహిళ భర్తను చితకబాదారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

బాధిత దంపతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ గణేషునిపాడులో గల ఓ రంగుల మిల్లులో ఓ జంట పనిచేస్తోంది. వీరు సుందరయ్య కాలనీలో నివాసముంటూ ప్రతిరోజూ ఉదయం ఆటోలో మిల్లుకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే శనివారం కూడా ఓ ఆటోలో మిల్లుకు బయలుదేరారు.  

read more  ఎగిరెగిరి గుండెలపై తన్ని, తలను గోడకేసి బాది... స్టూడెంట్ ను చితకబాదిన కసాయి టీచర్

అయితే ఆటోవాలా ఈ దంపతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరు స్నేహితులతో  కలిసి భర్త ఎదుటే వివాహితను వేధించాడు ఆటో డ్రైవర్. వివాహితపై చేతులు వేస్తూ నీచంగా మాట్లాడారు. అడ్డుకోబోయిన భర్తపై దాడిచేసి జనాలు గుమిగూడగానే పరారయ్యారు. 

అయితే ఈ దంపతులు పనిచేసే మిల్లువద్దకు వచ్చి వివాహిత ఎదుటే ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో దంపతులు రక్షణకోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం నిందితులను పట్టుకోకుండా ఈ దంపతులనే జాగ్రత్తగా వుండమని చెప్పి పంపించేశారట. తమపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మూడు రోజులుగా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత జంట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

click me!