శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

Published : Sep 13, 2018, 10:36 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ వారంట్ జారీ అయింది.  ఈ నెల 21వ తేదీన చంద్రబాబుతో పాటు మిగతా 16 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు అదేశించింది. 

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ వారంట్ జారీ అయింది.  ఈ నెల 21వ తేదీన చంద్రబాబుతో పాటు మిగతా 16 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు అదేశించింది. 

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుమల శ్రీవారి సేవలో వుండగానే తనకు నోటీసులు వచ్చినట్లు చంద్రబాబుకు తెలిసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి చంద్రబాబుపై  నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్నితెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

MSME Growth Summit 2026: MSME గ్రోత్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు కీలక ఒప్పందం | Asianet News Telugu
నువ్వెంత నీ బతుకెంత | YSRCP MP Avinash Reddy Fires On B.Tech Ravi | Asianet News Telugu