త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వాటికి ప్రీలిమ్స్ పరీక్ష రద్దు: ఏపీపీఎస్సీ

Siva Kodati |  
Published : Jul 16, 2021, 03:59 PM IST
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వాటికి ప్రీలిమ్స్ పరీక్ష రద్దు: ఏపీపీఎస్సీ

సారాంశం

ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రెడీ అయ్యింది. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కమీషన్ తెలిపింది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రీలిమ్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమీషన్ వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆగస్టు నుంచి అమలు చేస్తామని పేర్కొంది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలని, ప్రభుత్వానికి పంపామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ