
పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడటంతో (ap ssc results 2022) ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మండిపడ్డారు. జగన్ (ys jagan) అసమర్ధ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్..? అంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. మంత్రి బొత్సకు (botsa satyanarayana) తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య తెలుసా..? అంటూ ఎద్దేవా చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై విద్యార్దులకు సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇవాళే ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఆశతో ఎదురు చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముందుగానే పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటని అచ్చెన్నాయుడు నిలదీశారు. ఫలితాల వాయిదా అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ ప్రభుత్వ చేతకానితనమా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అసమర్ద పాలనతో విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతారా? మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. జగన్ విద్యాశాఖ మంత్రిని చేశారంటూ ఆయన మండిపడ్డారు.
Also Read:ap ssc results 2022: మంత్రి అలిగారని ఫలితాలు వాయిదా వేస్తారా .. జగన్ సర్కార్పై నారా లోకేష్ విమర్శలు
అంతకుముందు ఈ వ్యవహారంపై టీడీపీ (tdp) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని, తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ఆయన ఫైరయ్యారు. పదో తరగతి ఫలితాలను కూడా రాజకీయం చేశారంటూ నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఫలితాల తేదీని ప్రకటించారన్న కారణంగా ఫలితాలను అకస్మాత్తుగా వాయిదా వేస్తారా? అని ఆయన నిలదీశారు. ఫలితాలను వాయిదా వేసింది మంత్రి అలిగారనా? లేదా ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచక పాలనను చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు.
కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సమయం గడిచినా కూడా అధికారులు మాత్రం మీడియా సమావేశానికి హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఫలితాల విడుదల వాయిదా పడినట్టుగా అధికారులు సమాచారం ఇచ్చారు. ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. అయితే సోమవారం (జూన్ 6) ఏ సమాయానికి ఫలితాలు విడుదల చేస్తారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల వాయిదా వేశామని అధికారులు చెబుతున్నారు.