పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పీడ్ పెంచారు. ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు గాను జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుట్టిన నిమ్మగడ్డ శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు.
పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పీడ్ పెంచారు. ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు గాను జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుట్టిన నిమ్మగడ్డ శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రమేశ్కుమార్ త్వరలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈరోజు, రేపు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు