చిరు సేవలు మరవలేం.. మెగాస్టార్‌కు ఏపీ మంత్రి కృతజ్ఞతలు

Published : Jun 21, 2018, 06:11 PM IST
చిరు సేవలు మరవలేం.. మెగాస్టార్‌కు ఏపీ మంత్రి కృతజ్ఞతలు

సారాంశం

చిరు సేవలు మరవలేం.. మెగాస్టార్‌కు ఏపీ మంత్రి కృతజ్ఞతలు

ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ చిరంజీవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు.. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన చిరంజీవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..

ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ... చిరంజీవి రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో ఆయన సహకారంతో బందరులో రూ.5 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టామని.. అవి ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయని.. ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. మరోవైపు తాను కేటాయించిన నిధులతో ప్రారంభించిన పనులు విజయవంతంగా నడుస్తుండటంతో చిరు హర్షం వ్యక్తం చేశారు.. 

PREV
click me!

Recommended Stories

AP Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తకు పండ‌గ‌లాంటి వార్త‌.. తైవాన్ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు
3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam